మధ్యప్రదేశ్ లో మారుతున్న రాజకీయం సీఎంగా నరేంద్ర తోమర్?
బీజేపీ తరపున సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహానే తదుపరి ముఖ్యమంత్రే అని అందరూ భావిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్ఠానం ఒక్కసారిగా చక్రం తిప్పింది మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.. శివరాజ్ సింగ్ చౌహాన్ను కాదని, అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర వ్యవసాయ మంత్రి, నరేంద్ర మోదీకి అత్యంత ఆప్తుడైన నరేంద్ర సింగ్ తోమర్ను తెరపైకి తెచ్చారు. ఇప్పుడు తోమర్ ముఖ్యమంత్రి పదవి రేసులో ముందున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నరేంద్ర తోమర్ సీఎం పదవికి సరిగ్గా తూగుతారని బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే ఓ నిర్ణయానికి సైతం వచ్చేసింది.అంతేకాకుండా ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడు కావడం ఈయనకు కలిసొచ్చే అంశం. అయితే ఈ వార్తను అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఈయన గతంలో బీజేపీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.