YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాలకు ఇంచార్జీలుగా నిర్మలా, కిషన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాలకు ఇంచార్జీలుగా నిర్మలా, కిషన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాలకు ఇంచార్జీలుగా నిర్మలా, కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, మార్చి 27
కరోనా వైరస్‌ విజృంభణ వల్ల కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన వేళ తెలంగాణ, ఏపీల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించే బాధ్యతలను కేంద్ర ఇద్దరు కేంద్ర మంత్రులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ బాధ్యతలను, తెలుగింటి కోడలైన నిర్మలాసీతారామన్‌కు ఏపీ బాధ్యతలను అప్పగించారు. తెలంగాణలోని 33 జిల్లాలు, ఏపీలోని 13 జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకొని ఆయా కేంద్ర మంత్రులు సహాయక చర్యలపై చర్చించనున్నారు. రాష్ట్రాల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా కేంద్ర మంత్రులే తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రధాని మోదీ ఆదేశించారు.లాక్ డౌన్ వేళ దేశంలోని రాష్ట్రాల్లో పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులకు పీఎంవో బాధ్యతలు అప్పగించింది. కేబినెట్‌లోని మంత్రులు సహా సహాయ మంత్రులందర్ని రాష్ట్రాలకు ఇంచార్జిలుగా నియమించింది. వీరంతా తమకు కేటాయించిన రాష్ట్రాల్లోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయం చేసుకొని నివేదికలను పరిశీలించనున్నారు.
 

Related Posts