YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 చంద్రబాబు సలహాలు తీసుకోవాలి

 చంద్రబాబు సలహాలు తీసుకోవాలి

 చంద్రబాబు సలహాలు తీసుకోవాలి
విజయవాడ ఏప్రిల్ 8 
ప్రభుత్వం సహకరిస్తే 24 గంటల్లో విజయవాడ మొత్తం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయిస్తాను. అగ్నిమాపక యంత్రాలు సమకూర్చిస్తే కేవలం ఒక్క రోజులో నగరమంతా ద్రావణం చల్లించగలనని  టీడీపీ ఎమ్మెల్యే  గద్దె రామమోహన్ అన్నారు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, ఇంట్లోనే ఉండటం, సబ్బుతో చేతులు శుభ్రంగా కడగడం తోపాటు సోడియం హైపో క్లోరైడ్ వీధుల్లో చల్లితేనె కరోనా మహమ్మారి నుంచి బయటపడగలం. ఈ ద్రావణం ప్రాముఖ్యత తెలియడం వల్ల సొంత నిధులు, సొంత వాహనాలతో 21వ డివిజన్ లో చల్లిస్తున్నానని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో పరిపాలనా ధక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సేవలను ప్రభుత్వం వినియోగించుకోలేక పోయింది. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే చంద్రబాబు సలహాలు తీసుకున్నా ఎంతో బాగుండేది. ఎలాంటి అంటు రోగాలు ప్రభల కుండా పుష్కరాలు నిర్వహించిన సమర్ధవంతమైన నాయకుడు చంద్రబాబు. ప్రభుత్వం కరోనా పై యుద్ధం చేయకుండా టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడం పనిగా పెట్టుకుందని విమర్శించారు. చంద్రబాబుని విమర్శించే స్థాయి ప్రభుత్వంలో ఎవరికీ లేదు. కరోనా తో దేశం తల్లడిల్లు పోతుంటే జగన్ సర్కార్ తమ అనుయావులకు రూ. 6,500 కోట్లు కాంట్రాక్టు ఇచ్చి పెద్దకుంభకోణంకి తెర తీసిందని అన్నారు.
 

 

Related Posts