కరోనా కట్టడికి ముమ్మరంగా కృషి
కోడుమూరు ఏప్రిల్ 10
పట్టణంలో కరోనా కట్టడికి పోలీసు అధికారులు, పోలీసులు, వాలెంటర్ లు విశేషంగా కృషి చేస్తున్నారు. కోడుమూరు లో గత 17 రోజులు గా లాక్ డౌన్ జరుగుతోంది. అంతే కాకుండా ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రావడంతో కోడుమూరు పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. దీంతో పోలీసు శాఖ, వాలంటీర్లు రోడ్ల పైకి ప్రజలు రాకుండా జాగ్రత్తలూ తెలియచేస్తున్నారు. రెడ్ జోన్ నేపథ్యంలో కోడుమూరు అభివృధి కమిటీ సభ్యులు లాయర్ ప్రభాకర్, డాక్టర్ షా కీరు, ఆంధ్ర యా, కరే శ్రీనివాసులు, ఎం. హెచ్. స్వామి, ఆర్. ఖాజా, ఎల్ ఐ సి జయరాం, సి పి ఐ కృష్ణా, రాజు, మునిస్వమి, ఉపాధ్యాయ నాయకులు ఎస్ టీ యు తిమ్మన్న, అక్కన్న, నరసింహులు, విక్టర్, రణధీర్ హమాలీల్ పాల్గొన్నారు.