భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే వేడుకలు.
ఇళ్ళల్లోనే ప్రార్థనలకు జరుపుకున్న క్రైస్తవులు
జగిత్యాల ఏప్రిల్ 10
కరోన వైరస్, కోవిడ్- 19 నియంత్రణలో బాగంగా దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా యేసు క్రీస్తును సిలువ వేయబడిన శుభ శుక్రవారం (గుడ్ ఫ్రైడే) వేడుకలను జిల్లాలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గత మూడు వారాలుగా జిల్లాలోని అన్ని ఆలయాలను మూసివేయగా, క్రైస్తవులు కూడా తమ ఇల్లాల్లోనే ప్రార్థనలు జరువుకుంటున్నారు. క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గుడ్ ఫ్రైడే ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో పాల్గొనే భక్తులతో ఆయా ప్రార్థన మందిరాలు కిక్కిరిసి పోయేవి. అయితే కోవిడ్ -19, కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా చేపట్టిన లాక్ డౌన్ తో జిల్లాలోని క్రైస్తవ దేవాలయాలు భక్తులు లేక వెలవెలబోయాయి.