YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎస్ఈసీ పై వేటు చెల్లుబాటు కాదు

ఎస్ఈసీ పై వేటు చెల్లుబాటు కాదు

ఎస్ఈసీ పై వేటు చెల్లుబాటు కాదు
విజయవాడ ఏప్రిల్ 10
ఎస్ఈసీ రమేష్ కుమార్ పై వేటు నిర్ణయం చట్ట ప్రకారంగా చెల్లుబాటు కాదు. సీఎం జగన్ దుర్మార్గంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కరోనా బారిన పడకుండా 5 కోట్ల ప్రజలను రమేష్ కుమార్ కాపాడారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ లు కోర్టులో నిలబడవు. మాస్క్ లు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు. ఉద్యోగులపై జగన్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులపై.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్లు పెడుతున్నారని అయన ఆరోపించారు.

Related Posts