YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలులో కట్టడి చర్యలు

కర్నూలులో కట్టడి చర్యలు

కర్నూలులో కట్టడి చర్యలు
కర్నూలు, ఏప్రిల్ 10 
కర్నూలు జిల్లాలో భారీగా కరోనా వైరస్ (కోవిడ్ 19) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలులో త్వరలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించి ఐసీఎంఆర్‌ అనుమతి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. కర్నూలు కలెక్టర్‌ చాంబర్‌లో కోవిడ్‌–19 రాష్ట్ర ప్రత్యేకాధికారి, సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర, జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్, జాయింట్‌ కలెక్టర్‌ రవిపట్టన్‌ శెట్టి, ట్రైనీ కలెక్టర్‌ విధేకరేలతోపాటు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులతో మంత్రి బుగ్గన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చికిత్స చేసే వైద్యులకు, క్వారంటైన్లలో పనిచేసే సిబ్బందికీ పీపీఈలు, శానిటైజర్లు, ఎన్‌–95 మాస్కులు కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లాకు రెండు రోజుల్లో దాదాపు 5 వేల పీపీఈలు, ఆరువేల ఎన్‌ 95 మాస్కులు, లక్ష ట్రిపుల్‌ లేయర్‌ మాస్కులు వస్తాయని, వీటికి అదనంగా మరో 2,000 ఎన్‌–95మాస్కులు, 1,000 పీపీఈలు, 4 లక్షల ట్రిపుల్‌ లేయర్‌ మాస్కులకు అర్డర్లు పెట్టామన్నారు.కోవిడ్‌ ఆసుపత్రులు, క్వారంటైన్ల వద్ద బయో మెడికల్‌ వేస్టును జాగ్రత్తలు వహించి డిస్పోజ్‌ చేసుకునేలా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం టిడ్కో హౌసింగ్‌ కాలనీలో ఏర్పాటు చేయనున్న క్వారంటైన్‌ కేంద్రంలో వసతులను పరిశీలించారు. ల్యాబ్ దిశగా అడుగులు త్వరలోనే కర్నూలులో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఐసీఎంఆర్‌ అనుమతి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు.  కలెక్టర్‌ చాంబర్‌లో కోవిడ్‌–19 రాష్ట్ర ప్రత్యేకాధికారి, సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర, జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్, జాయింట్‌ కలెక్టర్‌ రవిపట్టన్‌ శెట్టి, ట్రైనీ కలెక్టర్‌ విధేకరేలతోపాటు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులతో సుధీర్ఘంగా చర్చించారు. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చికిత్స చేసే వైద్యులకు, క్వారంటైన్లలో పనిచేసే సిబ్బందికీ పీపీఈలు, శానిటైజర్లు, ఎన్‌–95 మాస్కులు కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లాకు రెండు రోజుల్లో దాదాపు 5 వేల పీపీఈలు, ఆరువేల ఎన్‌–95 మాస్కులు, లక్ష ట్రిపుల్‌ లేయర్‌ మాస్కులు వస్తాయని, వీటికి అదనంగా మరో 2 వేల ఎన్‌–95మాస్కులు, 1000 పీపీఈలు, 4లక్షల ట్రిపుల్‌ లేయర్‌ మాస్కులకు అర్డర్లు పెట్టామన్నారు. కోవిడ్‌ ఆసుపత్రులు, క్వారంటైన్ల వద్ద బయో మెడికల్‌ వేస్టును  జాగ్రత్తలు వహించి డిస్పోజ్‌ చేసుకునేలా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం టిడ్కో హౌసింగ్‌ కాలనీలో ఏర్పాటు చేయనున్న క్వారంటైన్‌ కేంద్రంలో  వసతులను పరిశీలించారు

Related Posts