YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

దేహశుద్ది

దేహశుద్ది

దేహశుద్ది
వేములవాడ మే 16
ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని 11 సంవత్సరం లు గడిసినా పిల్లలు పుట్టలేదని కారణం తో చేసుకున్న భార్యకు తెలువకుండానే మరో అమ్మాయి ని పెళ్లి చేసుకుంన్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య బంధువులు భర్త ఇంటిపై దాడి చేసి భర్త బందులను చితక బాదారు.  దాడికి వస్తున్నారు అని ముందే తెలుసుకున్న ఆ భర్త తన రెండోవ భార్యతో పరారయ్యాడు. రాజన్న సిరిసిల్లా జిల్లా, వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్,  రగుడు గ్రామానికి చెందిన అరుణ శ్రీ ని 11 సంవత్సరం క్రితం ఇంటర్ చదువుతున్న సమయం లో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టక పోవడం తో గత 5 సంవత్సరం ల నుండి మరో పెళ్లి చేసుకుంటానని వేధించడం, చితకబాదడం చేసేవాడిని, దెబ్బలు భరించలేక, పెట్టె చిత్రహింసలు తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పడం తో పోలీసులకు పిర్యాదు చేయగా వీరిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మల్లి వేధించడం, చితక బాదడం చేయడం తో భరించలేక ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది.  ఇదే అదునుగా భావించి గంగాధర్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన చిక్కి అనే అమ్మాయి కి లక్ష రూపాయలు ఎదిరిచ్చి 5 రోజుల క్రితం పెళ్లిచేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య, బంధువులు భర్త శ్రీనివాస్ ఇంటి పై దాడికి దిగారు, మొదటి భార్య బంధువులు దాడికి వస్తున్నారని తెలుసుకొని రెండో భార్య తో పరార్ అయ్యాడు. మొదటి భార్య బంధువులు శ్రీనివాస్ కుటుంభ సభ్యుల పై దాడికి దిగి కొట్టారు. అనుపురం గ్రామం లో జరుగుతున్న గొడవ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం కు వచ్చి నచ్చచెప్పారు. ఇరువురి పిర్యాదలపై కేసునమోదు చేస్తుకొని దర్యప్తి చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Related Posts