YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

జమ్మూ కశ్మీర్‌లో మరో మేజర్ ఎన్‌కౌంటర్

జమ్మూ కశ్మీర్‌లో మరో మేజర్ ఎన్‌కౌంటర్

జమ్మూ కశ్మీర్‌లో మరో మేజర్ ఎన్‌కౌంటర్
శ్రీనగర్, మే 19
జమ్మూ కశ్మీర్‌లో మరో మేజర్ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ అమరులయ్యారు. మరో పోలీస్ అధికారి, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఓ జవాన్ గాయపడ్డారు. భారత భద్రతా దళాల చేతిలో హతమైన ఉగ్రవాదుల్లో ఓ ముష్కరుడు జమ్మూ కశ్మీర్ వేర్పాటువాద నాయకుడి కుమారుడిగా అధికారులు గుర్తించారు. మంగళవారం (మే 19) వేకువజామున 2 గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.కశ్మీర్‌లోని నవాకడల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ప్రవేశించారనే పక్కా సమాచారంతో సీఆర్‌పీఎఫ్ జవాన్లు, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో నవాకడల్ ప్రాంతంలో రెండు ఇళ్లలో నక్కిన ముష్కరులు భారత భద్రతా దళాలపై ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు షెల్టర్ తీసుకున్న ఇళ్లను భద్రతా దళాలు పేల్చివేసినట్లు అధికారులు తెలిపారు.ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని జునైద్ సెహ్రాయ్‌గా అధికారులు గుర్తించారు. ఇతడు కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, తెహ్రీక్-ఇ-హురియత్ అధ్యక్షుడు మొహమ్మద్ అష్రాఫ్ సెహ్రాయ్ కుమారుడు. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్‌గా కొనసాగుతున్నాడు. తప్పించుకున్న మరికొంత మంది ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నవాకడల్ ప్రాంతంలో ముంద జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.కశ్మీర్‌లోని కుల్గాంలో ఇటీవల భారీ ఎన్‌కౌంటన్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదురురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులను మట్టుబెట్టే క్రమంలో ముగ్గురు పోలీసు అధికారులు అమరులైన అంశం దేశాన్ని కంటతడి పెట్టించింది. కరోనా వైరస్ పంజా విసురుతున్న వేళ.. ఇదే అదనుగా చేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలు విస్తృతం చేయాలని హిజ్బుల్ ముజాహిదీన్ భావిస్తోంది. దీన్ని భారత భద్రతా బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి.

Related Posts