YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

బరితెగించిన భార్య.. పడక సుఖం కోసం ప్రియుడితో పరారు

బరితెగించిన భార్య.. పడక సుఖం కోసం ప్రియుడితో పరారు

బరితెగించిన భార్య.. పడక సుఖం కోసం ప్రియుడితో పరారు
చెన్నై, మే 19,
పడక సుఖం కోసం బరితెగించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వివాహేతర సంబంధాల మోజులో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. భర్తని వదిలేసి ప్రియుడితో పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లిని, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ని దారుణంగా హత్య చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. గుర్తుతెలియని దుండగులు మారణాయుధాలతో దాడి చేసి కిరాతకంగా చంపేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.మదురై జిల్లాలోని మేలూరు పట్టణానికి సమీపంలోని అండిపట్టి వద్ద గుర్తుతెలియని దుండగులు జంటను దారుణంగా హత్య చేశారు. నైకర్‌పట్టి రోడ్టులో కాపుకాసిన దుండగులు బైక్‌పై వస్తున్న అయ్యమ్మాళ్(26), ఆమె ప్రియుడు అన్బునాథన్(32)ని అతి దారుణంగా నరికి చంపేశారు. ప్రియుడి గొంతుకోసం కిరాతకంగా అంతమొందించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను పరిశీలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు గుర్తించారు.సమీపంలోన తేర్కుత్తెరి గ్రామానికి చెందిన అయ్యమ్మాళ్‌కి విమల్ అనే వ్యక్తితో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లల సంతానం. అదే గ్రామానికి చెందిన అన్బునాథన్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ రహస్యంగా కలుసుకుని రాసలీలలు సాగించేవారు. భర్త లేని సమయంలో ఇద్దరూ ఎంజాయ్ చేసేవారు. పడక సుఖం కోసం పరితపించిపోయిన ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారు.భర్తని, బిడ్డలను వదిలేసిన అయ్యమ్మాళ్ ప్రియుడి మోజులో ఊరి నుంచి పారిపోయింది. కొద్దిరోజుల అనంతరం ఇద్దరూ తిరిగి గ్రామానికి వచ్చారు. అయితే అన్బునాథన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం.. అతనితో పారిపోవడం నచ్చని ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ నేపథ్యంలో వారిద్దరినీ దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయ్యమ్మాళ్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. కేసు విచారణలో ఉంది.

Related Posts