YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

పసరు పోసి చంపేశారు...

పసరు పోసి చంపేశారు...

పసరు పోసి చంపేశారు...
చెన్నై, మే 19,
నాలుగు రోజుల పసికందును పసరు పోసి చంపేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. నాలుగోసారీ ఆడపిల్లే పుట్టిందన్న ఆక్రోశంతో కన్నతండ్రి, నానమ్మ ఈ దారుణానికి ఒడిగట్టారు. పిల్లలను చంపేందుకు వినియోగించే ఆకుల పసరును పసికందు గొంతులో పోసి చంపేసి ఊరికి సమీపంలోని నదిలో పూడ్చిపెట్టేశారు. సీన్‌లోకి ఎంటరైన పోలీసులు పాప శవాన్ని వెలికితీయించి పోస్టుమార్టం జరిపించడంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అత్యంత దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.మదురై జిల్లా షోలవందన్‌ పంచాయతీకి చెందిన తవమణి(33) దంపతులకు ముగ్గురు కుమార్తెలు సంతానం. ఇటీవల అతని భార్య నాలుగోబిడ్డకు జన్మనిచ్చింది. ఈసారి కూడా ఆడపిల్లే పుట్టడంతో ఆగ్రహం చెందిన తవమణి, అతని తల్లి పాండియమ్మాల్(57) పసికందును చంపేయాలని నిర్ణయించుకున్నారు. పురిటి బిడ్డలను చంపేందుకు స్థానికంగా ఉపయోగించే ఆకుపసరు గొంతులో పోసి చంపేశారు.పాప శవాన్ని ఊరికి సమీపంలోని నదిలో పూడ్చిపెట్టేశారు. అయితే పసికందు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వీఏవోకి.. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సీన్‌లోకి పోలీసులు ఎంటరవడంతో తవమణి, అతని తల్లి హైడ్రామాకు తెరతీశారు. బిడ్డ ఆరోగ్యం బాగోక చనిపోవడంతో నదిలో పూడ్చిపెట్టామని.. పాపను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌కి కూడా ఫోన్ చేశామని చెప్పారు. పురిటి బిడ్డ లోపాలతోనే చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారుఅయితే పాప శవాన్ని వెలికితీయించిన పోలీసులకు తల, పుర్రె భాగంలో గాయాలు కనిపించడంతో అనుమానం వచ్చి పోస్టుమార్టానికి పంపించారు. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లీకొడుకుల డ్రామాకు తెరపడింది. బిడ్డపై విషప్రయోగం జరిగిందని.. అనంతరం ఊపిరాడకుండా చేసి చంపేశారని పోస్టుమార్టం రిపోర్టులో తేలడంతో అసలు బండారం బయటపడింది.

Related Posts