YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

బతికుండగానే బావిలోకి...గొర్రెకుంట మృతుల పోస్టుమార్టం రిపోర్టు

బతికుండగానే బావిలోకి...గొర్రెకుంట మృతుల పోస్టుమార్టం రిపోర్టు

బతికుండగానే బావిలోకి...గొర్రెకుంట మృతుల పోస్టుమార్టం రిపోర్టు
వరంగల్ మే 23,
వరంగల్ జిల్లాలోని గొర్రెకుంట బావిలో బయటపడ్డ తొమ్మిది మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం పూర్తి అయ్యింది. ప్రాణం ఉండగానే నీటిలో పడి చనిపోయినట్టు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. విషప్రయోగమా? మత్తు మందు ఇచ్చారా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో షకీల్, యాకూబ్ ఫోన్సే కీలకంకానున్నాయి. కాల్ డేటా ఆధారంగా వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసులో మహ్మద్ మక్సూద్ ఆలంకు సన్నిహితుడైన డ్రైవర్ షకీల్ అహ్మద్ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. షకీల్ సెల్ఫోన్ పై దృష్టి సారించిన పోలీసులు కాల్ డేటాను సేకరిస్తున్నారు.  బుస్రా ఖాతూన్ ప్రియుడిగా అనుమానం ఒక వ్యక్తిని  పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. బీహార్కే చెందిన దర్భంగా జిల్లా కేవిట్ తాలూకా సిసోనా వాసి సంజయ్ కుమార్ యాదవ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గొర్రెకుంట ఘటనలో మృతి చెందిన తొమ్మిది మందిలో ఏడుగురి సెల్ఫోన్ల ఆచూకీపై టెన్షన్ నెలకొంది. మృతుల ఫోన్ నంబర్లను పోలీసులు ప్రకటించారు. మృతదేహాలను వెలికి తీసిన తర్వాత సెల్ఫోన్ల కోసం బావి నుంచి నీరంతా తోడినా ఆధారాలు లభించలేదు

Related Posts