YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

సొంత అక్కతోసంబంధమనే అనుమానం

సొంత అక్కతోసంబంధమనే అనుమానం

సొంత అక్కతోసంబంధమనే అనుమానం
ఒంగోలు, మే 23,
అక్కతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో సొంత బావమరిదిని బావ హత్య చేశాడు. పరారీలో ఉన్న నిందితుడు ఎట్టకేలకు లొంగిపోయాడు.ప్రకాశం జిల్లా దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెంలో జరిగిన పోకూరి రామస్వామి(55) హత్య కేసును పోలీసులు ఛేదించారు. సొంత అక్కతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో బావమరిదిని బావే కొట్టి చంపినట్లు తేల్చారు. గ్రామానికి చెందిన పోకూరి రామస్వామి సొంత అక్కను దామా సుబ్బారావు వివాహం చేసుకున్నాడు.బావమరిది రామస్వామి గతేడాది సొంత ఇంటి కోసం భూమి పూజ చేశాడు. ఆ కార్యక్రమానికి బంధువులు రావడంతో అక్క ఇంటికి వెళ్లి పడుకున్నారు. ఆ సమయంలో అక్క పక్కనే రామస్వామి పడుకున్నాడు. అది చూసిన సుబ్బారావు సొంత అక్కతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించాడు. తన భార్యతో రాసలీలలు సాగిస్తున్నాడన్న అనుమానంతో పగ పెంచుకున్నాడు.అదను చూసి అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 12న రాత్రి భోజనం చేసి వచ్చి గొర్రెల దొడ్డి వద్ద కాపలాగా పడుకుని ఉన్న రామస్వామిని దారుణంగా కొట్టి చంపేశాడు. రోకలిబండతో ముఖంపై బలంగా కొట్టడంతో రామస్వామి అక్కడికక్కడే చనిపోయాడు. రామస్వామి హత్యతో ప్రశాంతంగా ఉన్న పల్లె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఊళ్లో మంచిపేరున్న రామస్వామిని ఎవరు హత్య చేశారనే మిస్టరీ ఎట్టకేలకు వీడింది.అప్పటి నుంచి పరారీలో ఉన్న బావ సుబ్బారావు వీఆర్వో వద్ద లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. అక్కతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే బావమరిదిని హతమార్చినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

Related Posts