YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ జేఈవో ఇంట్లో చోరీ

టీటీడీ జేఈవో ఇంట్లో చోరీ

టీటీడీ జేఈవో ఇంట్లో చోరీ
తిరుపతి మే 25
తిరుపతిలో టీటీడీ జేఈవో బసంత్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు నిన్న రాత్రి కిటికీ అద్దాలు పగలగొట్టి ఇంటి లోపలికి ప్రవేశించి 18 తులాల బంగారం 5 తులాల వెండి చోరీ చేశారు. దొంగతనం అనంతరం నిద్రిస్తున్న జే ఈవో కుటుంబసభ్యులు బయటకు రాకుండా  బయట గడియపెట్టి పారిపోయారు. ఈ ఘటనపై ఈరోజు ఉదయం జేఈవో బసంత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు .దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న జేఈవో నివాసానికి చేరుకొని క్లూస్ టీం తో వేలిముద్రల సేకరణ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
 

Related Posts