YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 నా చావుకు భార్యే కారణం

 నా చావుకు భార్యే కారణం

 నా చావుకు భార్యే కారణం
కరీంనగర్, మే 28,
భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలో బుధవారం జరిగింది. గంట్యాల శ్రీధర్‌(35) అనే వ్యక్తి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన శ్రీధర్‌కు రామడుగు మండల కేంద్రానికి చెందిన జల అనే యువతితో 2011లో వివాహం జరిగింది. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో పెద్దల మధ్య పంచాయతీలు జరిగాయి. ఈ క్రమంలోనే మద్యానికి బానిసైన శ్రీధర్ భార్యను వేధించసాగాడు. దీంతో 10 రోజుల క్రితం భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది.రెండ్రోజుల క్రితం శ్రీధర్ భార్య మరో మహిళను వెంటబెట్టుకుని భర్త వద్దకు వచ్చింది. పెళ్లయి ఇన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడం వల్ల వైద్య పరీక్షలు చేయించుకోవాలని, రెండ్రోజుల్లో కరీంనగర్‌కు రాకపోతే అంతు చూస్తానని బెదిరించి వెళ్లింది. దీంతో పాటు భార్య తరపు బంధువులు కూడా అతడిని బెదిరింపులకు గురిచేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీధర్ మంగళవారం ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అయితే ఎస్ఐ సాయంత్రం వస్తారని, అప్పుడు రావాలని సిబ్బంది చెప్పడంతో ఇంటికి వచ్చేశాడు. భార్య కాపురానికి రాకపోవడం, ఆమె బంధువుల తరపు నుంచి వేధింపులు ఎదురుకావడంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీధర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. తన కోడలి కుటుంబసభ్యులు, బంధువులు తీవ్రంగా వేధించడం వల్లనే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ‘తన ఆస్తిలో భార్యకు పైసా కూడా ఇవ్వొద్దని, ఆస్తి మొత్తం తల్లికే చెందుతుందని, తన చావుకు భార్య జలనే కారణమని’ శ్రీధర్ సూసైడ్‌ నోట్‌లో రాశాడు. దాని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

Related Posts