YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

న్యాయస్థానంపై కామెంట్ 33 మందిపై కేసులు

న్యాయస్థానంపై కామెంట్ 33 మందిపై కేసులు

న్యాయస్థానంపై కామెంట్ 33 మందిపై కేసులు
విజయవాడ, మే 29,
న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యల అంశంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో సీఐడీ అధికారులు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మరో న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరో 44 మందికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో హైకోర్టును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ అధికార వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, పాత్రికేయుడు కామినేని శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు ప్రసాద్ రెడ్డి, ఎన్నారై పంచ్‌ ప్రభాకర్‌ సహా 44 మందికి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.కాగా, ఇదే కేసులో ఇటీవల 49 మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. కోర్టులను కించపరిచే వ్యాఖ్యలు చేసిన పలువురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
 

Related Posts