YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 కన్నకూతురుపై తండ్రి రేప్

 కన్నకూతురుపై తండ్రి రేప్

 కన్నకూతురుపై తండ్రి రేప్
వికారాబాద్, మే 30
లాక్‌డౌన్ కారణంగా మార్చి నెల నుంచి ఇంట్లోనే ఉంటున్న కూతురిపై కన్నేశాడో కామాంధుడు. రంజాన్ రోజున ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక పెద్దమ్మతో చెప్పడంతో కేసు నమోదైంది.కన్నకూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. వావి వరుసలు మరిచి ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగింది. తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (13) తల్లి పదేళ్ల క్రితమే మృతి చెందింది. అనంతరం తండ్రి (37) మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో కూతురును దోమ మండలంలోని ఓ పాఠశాలలో ఉంచి చదివిస్తున్నాడు. మార్చిలో లాక్‌డౌన్‌ కారణంగా కూతురు ఇంటికి వచ్చేసింది. కామంతో కన్న కూతురిపైనే కన్నేసిన ఆ దుర్మార్గుడు రంజాన్ రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది.బాలిక రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని పెద్దమ్మ ఇంటికి వచ్చింది. ఆమె దీనంగా ఉండటాన్ని గమనించిన పెద్దమ్మ ఏం జరిగిందని అడగ్గా తండ్రి తనపై జరిపిన అఘాయిత్యాన్ని వివరించింది. దీంతో ఆమె గ్రామానికి చేరుకుని బాలిక నాయనమ్మకు విషయం చెప్పింది. బంధువులందరూ కలిసి ఆ కీచక తండ్రిని నిలదీశారు. అనంతరం తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వికారాబాద్, మే 30, 
లాక్‌డౌన్ కారణంగా మార్చి నెల నుంచి ఇంట్లోనే ఉంటున్న కూతురిపై కన్నేశాడో కామాంధుడు. రంజాన్ రోజున ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక పెద్దమ్మతో చెప్పడంతో కేసు నమోదైంది.కన్నకూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. వావి వరుసలు మరిచి ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగింది. తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (13) తల్లి పదేళ్ల క్రితమే మృతి చెందింది. అనంతరం తండ్రి (37) మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో కూతురును దోమ మండలంలోని ఓ పాఠశాలలో ఉంచి చదివిస్తున్నాడు. మార్చిలో లాక్‌డౌన్‌ కారణంగా కూతురు ఇంటికి వచ్చేసింది. కామంతో కన్న కూతురిపైనే కన్నేసిన ఆ దుర్మార్గుడు రంజాన్ రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది.బాలిక రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని పెద్దమ్మ ఇంటికి వచ్చింది. ఆమె దీనంగా ఉండటాన్ని గమనించిన పెద్దమ్మ ఏం జరిగిందని అడగ్గా తండ్రి తనపై జరిపిన అఘాయిత్యాన్ని వివరించింది. దీంతో ఆమె గ్రామానికి చేరుకుని బాలిక నాయనమ్మకు విషయం చెప్పింది. బంధువులందరూ కలిసి ఆ కీచక తండ్రిని నిలదీశారు. అనంతరం తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Related Posts