YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ఆరుగురు పోలీసులపై వేటు

ఆరుగురు పోలీసులపై వేటు

ఆరుగురు పోలీసులపై వేటు
హైదరాబాద్ మే 30
రాచకొండ పోలీసు కమిషనరేటు పరిధిలోని మేడిపల్లిలో డీజీల్ అక్రమ దందాకు సహకరిస్తున్న పోలీసులపై వేటు పడింది.  ఆరుగురు పోలీసులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సస్పెండ్ చేసారు. ఎస్ఓటీ ఇన్స్ పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, ఎస్బీ కానిస్టేబుల్ సస్పెన్షన్ అయిన వారిలో వున్నారు. దాంతోపాటు  మేడిపల్లి ఠాణాకు చెందిన మరో ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ నెల18న మేడిపల్లిలో డీజీల్ చోరి చేస్తున్న ముఠాను పోలీసులు  అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముఠా సభ్యులను విచారించడంతో పోలీసుల హస్తం బయటపడింది. డీజిల్ ముఠాకు సహకరించిన వారిని సస్పెండ్ చేస్తూ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ ఉదంతంలో మరికొంత మంది పోలీసుల హస్తంపై  దర్యాప్తు కొనసాగుతుందని సమాచారం.

Related Posts