YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆకాశన్నంటిన మామిడి ధరలు.....!!!

 ఆకాశన్నంటిన మామిడి ధరలు.....!!!

పళ్ళల్లో రాజు ఏది అంటే ఎవరైనా సరే టక్కున మామిడిపండు అని చెప్పేస్తారు. మామిడి పండు అంటే ఇష్టపడని వారు ఒక్కరు కూడా ఉండరు..సీజన్ వచ్చేసింది. కానీ పండ్లు మాత్రం ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల దర్శనమిస్తున్నాయి.. అయితే వాటి ధరలు కూడా ఆకాశానంటుతున్నాయి. మరి ఎందుకు ఈ సారి ఇంత ఆలస్యమో. .ధరలు అంతలా ఎందుకు పెరిగిపోయాయో తెలుసుకుందాం.ఎండకాలం వచ్చిందంటే చాలు.. ప్రతి ఒక్కరు కూడా సూర్యతాకిడికి సతమతమవుతారు. ఓ పక్క ఎండగురించి భాదపడుతూనే మరోపక్క ఆనందపడుతారు. ఎందుకంటే ఈ సీజన్ లోనే రుచికరమైన మామిడి పండ్లు వచ్చేస్తాయి. పిల్లలను మొదలుకుని పెద్దవారి వరకు ప్రతిఒక్కరు వీటిని లొట్టలేసుకుంటూ మరీ తినేస్తారు. మామిడి పండ్లలో చాలా రకాలే ఉన్నాయి. కానీ ఒక్కో పండుకు ఒక్కో రకమైన విశేషముంటుంది. బంగిన పల్లి , రసాల్ , హిమయత్ , తోతాపరి , సుందరి , పంచదారి , దసేరి , బేనిషాన్ .. ఇలా చెప్పుకుంటూ పోతే వందకు పైనే మామిడి పండ్ల రకాలున్నాయి. అందుకే మామిడి పండ్లకు అంత డిమాండ్ ఉంటుంది. టేస్ట్ బట్టి వాటి ధరలు కూడా ఉంటాయి. వీటన్నిటిలో మామిడి పండ్లల్లో రాజు బంగిన పల్లి.. ఇవి అత్యంత రుచిని కలిగి ఉంటాయి. వీటి ధర కూడా కాస్త ఎక్కువే ఉంటుంది.ఈ సారి మాత్రం మామిడి కాయ ప్రియులకు చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలోనే వచ్చే ఈ పళ్ళు ఈ సారి మార్చి మూడవ వారం దాటుతున్నా ఇంక ఎక్కడా కనబడటం లేదు. ఇప్పుడిప్పుడే మార్కెట్లలోకి కేవలం కొన్ని రకాల మామిడి కాయలే వస్తున్నాయి. కొత్తపేట పండ్ల మార్కెట్ లో కేవలం మూడు రకాల మామిడి కాయలే వచ్చాయి. రసాల్, హిమయత్, బంగిన పల్లి రకాలే కనిపిస్తున్నాయి. వాటి ధర కూడా ఆకాశానంటే విధంగా పలుకుతున్నాయి. కేవలం కిలో ధర 400 నుండి 500 రూపాయలు పలుకుతున్నాయి. అంటే.. అంతగా ఖర్చు పెడితే తినేది కేవలం రెండు కాయలే.. అకాల వర్షాల వల్ల చాలా వరకు పూత మొత్తం పోయిందని దీంతో కాయలు కూడా చేతికి చాలా తక్కుక వచ్చాయని రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు. రైతులు దగ్గర కొనే వారు కూడా ధరలు అధికంగా ఉండటంతో కొనాలంటేనే ఆలోచిస్తున్నారు. పైగా అవి కేవలం కాయలే ..మళ్ళీ వాటిని మగ్గపెట్టాలంటే చాలా ప్రాసెస్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సారి మామిడి ప్రియులకి చేదువార్త అనే చెప్పాలి. మామిడి పండ్ల ధరలు ఆకాశానంటటంతో పాటు.. మార్కెట్ లోకి త్వరగా తీసుకు రావడానికి కార్బోహైడ్రేట్స్ వంటివి వాడి కూడా కాయలను పండ్లు చేసే అవకాశం ఉంది ..దాంతో కొనుగోలు దారులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Related Posts