సికింద్రాబాద్ లో మరో యువతి ప్రియుడు మోసగించాడని అందోళనకు దిగింది. సికింద్రాబాద్ మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పక్కన టెంట్ వేసుకుని శిరీష బైఠాయించింది. నితిన్ యాదవ్ తను పెళ్లి చేసుకుంటానని మోసం చేసాడని ఆమె ధర్నాకు దిగింది. వాట్స్ అప ద్వారా పరిచమయిన నితిన్, తావంటే ఇష్టమని పరిచయం చేసుకుని మోసానికి పాల్పడ్డ ని ఆమె ఫిర్యాదు చేసింది. తనను అన్ని రకాలుగా వాడుకుని ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని నితిన్ ఇంటి ముందు నిరాహర దీక్షకు దిగింది. నాకు న్యాయం కావాలి. నితిన్ తో వివాహం చేయాలని శిరీష డిమాండ్ చేసింది. ఆమె కు పలు మహిళ సంఘాలు మద్దతు తెలిపాయి.