YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గుంటూరులో ప్రియుడి ఇంటి ముందు దీక్ష

గుంటూరులో  ప్రియుడి ఇంటి ముందు దీక్ష

గుంటూరు, జూలై  4, 
ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. ప్రేమను అంగీకరించాక పెళ్లి చేసుకుంటానంటూ షికార్లకు తిప్పాడు. ఈ క్రమంలోనే ఆమెకు శారీరకంగా దగ్గరై కోరికలు తీర్చుకుంటూ వచ్చాడు. కొద్దిరోజులు అయ్యాక నీపై మోజు తీరిపోయిందంటూ మొహం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ప్రియుడి ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపట్టింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.సత్తెనపల్లి గ్రామీణ మండలంలోని పెదమక్కెన గ్రామానికి చెందిన ఓ యువతి శుక్రవారం ప్రియుడి ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపట్టింది. తన ఇంటి ఎదురుగా ఉండే యువకుడు తనను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడని, కొంతకాలంగా తనతో శారీరక కోరికలు తీర్చుకుంటూ పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడని బాధితురాలు చెబుతోంది. తనకు న్యాయం చేసేవరకు దీక్ష విరమించేది లేదని తేల్చి చెబుతోంది. తన ప్రియుడిని తల్లిదండ్రులు వేరే ప్రాంతానికి తరలించి నాటకమాడుతున్నారని ఆరోపిస్తోంది.అయితే ఈ విషయంపై స్పందించిన యువకుడి తల్లి.. తమ కొడుకు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడని, ఆదివారం అతడిని ఇంటికి పిలిపించి చర్చిస్తామని చెబుతోంది. యువతి దీక్ష విరమిస్తేనే చర్చలకు అవకాశముంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని సత్తెనపల్లి పోలీసులు తెలిపారు.

Related Posts