YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు రఘరామరాజు లేఖ

జగన్ కు రఘరామరాజు లేఖ

హైద్రాబాద్, జూలై 4, 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని కోరారు. పాదయాత్ర సమయంలో ప్రజలకు హామీ ఇచ్చారని ఏపీ సీఎంకు గుర్తుచేశారు. జిల్లాకు పేరు పెడతామని అధికారికంగా ప్రకటన చేస్తే ప్రజలు ఎంతో సంతోషపడతారన్నారు. రెండు రోజుల క్రితం రాసిన లేఖను ఎంపీ క్యారాలయం మీడియాకు విడుదల చేసింది. ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీలు రఘురామపై ఫిర్యాదు చేసిన మరుసటి రోజే లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.రఘురామకృష్ణంరాజు సొంత పార్టీ నేతలపై, ప్రభుత్వం చేసిన వ్యాఖ్యల్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. వారంలోగా సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసులు పంపారు. కానీ ఆయన మాత్రం సమాధానం కాకుండా రిప్లై అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఏకంగా పార్టీకే టెండర్ పెట్టారు.. అలాగే క్రమశిక్షణ కమిటీ లేదన్నారు. అలాగే సీఎం జగన్‌కు మరో లేఖ రాశారు. తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి స్పీకర్‌‌ను, కేంద్రమంత్రుల్ని కలవడం కాకరేపింది. అటు వైఎస్సార్‌సీపీ అధిష్గానం కూడా రఘురామ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. స్పీకర్‌కు ఫిర్యాదు చేయించింది

Related Posts