YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిర్వాసితుల ఇళ్లు కూల్చివేత

నిర్వాసితుల ఇళ్లు కూల్చివేత

ఇల్లందు జూలై 7, 
భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో సింగరేణి నిర్వాసితుల ఇళ్లను సింగరేణి అధికారులు తమ సిబ్బందితో వచ్చి ఖాళీ చేస్తూ నేలమట్టం చేస్తున్నారు. నిర్వాసితులకు నష్టపరిహారాలు చెల్లించి వారికి ఆర్ ఆర్ కాలనీలో స్థలాలు ఇల్లు  నిర్మాణానికి నష్టపరిహారం చెల్లించి నప్పటికీ ఖాళీ చేయకపోగా ఉపరితల గని సమీపంలో ఉన్న ఇళ్లకు సింగరేణి బ్లాస్టింగ్ కారణంగా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యం గృహాలు కూడా శిధిలావస్థలో ఉన్నందున కూల్చి వేస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా నిర్వాసితుల ది ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. తమకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం రాలేదని కొందరు తెలుపుతుండగా న్యాయపరంగా తమకు నష్టపరిహారం రాలేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు సిఐ వేణు చందర్, ఎస్సై రవి పర్యవేక్షిస్తున్నారు

Related Posts