YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

గంజాయి స్వాధీనం

గంజాయి స్వాధీనం

భద్రాద్రి జూలై 7, 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి సమీపంలో ఆటోలో 12 లక్షల విలువచేసే గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోలు సీజ్ చేశారు. ఈ ఆటో వెనుక ఫాలో అవుతున్న ముగ్గురు బైక్ ఇష్టులు తమ బైక్లను వదిలి పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు  వ్యక్తులు ఒకరు ఇల్లందు మండలం పోచారం గ్రామానికి చెందిన బానోత్ రమేష్, మరొకరు తూర్పు గోదావరికి జిల్లా పాల గడ్డ గ్రామానికి చెందిన కిషోర్. ఇద్దరి తో పాటు మరో ముగ్గురు చతిస్గడ్ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసి మహబూబాబాద్ నర్సంపేట తూర్పుగోదావరి తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.  ఈ ఈ సందర్భంగా సీఐ రాజు మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశతో గంజాయి విక్రయానికి పాల్పడుతున్నారన్నారు.  యువకులను గంజాయికి బానిసలు చేస్తున్నారని తెలిపారు.. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Related Posts