నిర్మల్ జూలై 7,
నిర్మల్ జిల్లా కుభీర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరిపోయే మందులు ఉన్నాయాని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రజలకు ఏ వ్యాధులు రాకుండా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు తుమ్ లక్ష్మీ బాయి, ఉపాధ్యక్షులు మోహినోద్దీన్, టిఆర్ఎస్ జిల్లా కార్యదర్శి తూమ్ రాజేశ్వర్, సహకార సంఘం అధ్యక్షులు గంగా చరణ్, కుభీర్ సర్పంచ్ మీరా విజయ్ కుమార్, టిఆర్ఎస్ అధ్యక్షులు అనిల్, ఎస్సై ప్రదీప్ కుమార్, ఫారెస్ట్ అధికారి కోటేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి శంకర్ చౌహాన్, డాక్టర్ లు ఆశిష్ రెడ్డి, అవినాష్, సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.