చొప్పదండి జూలై 24,
రాష్ట్రఐటీ,పురపాలక శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటిఆర్ గారి జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మొక్కలు నాటారు. కేటిఆర్ జన్మదినం పురస్కరించుకొని 200 మంది పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ కీర్తిని ప్రపంచ స్థాయిలో ఇనుమడింపచేసారని అన్నారు.ఐటీ శాఖలో అనేక మార్పులు,పరిపాలన పరమైన మార్పులు తీసుకొచ్చి వ్యాపార వేత్తలకు కంపెనీలు నెలకొల్పే విధంగా ఐటీ పాలసీ చేసారని అన్నారు.పురపాలక శాఖలో అనేక మార్పులు చేసి ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారులు దగ్గరుండేలా చేశారు..ఈ కార్యక్రమంలో పలువురు నియోజక వర్గ టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.