YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందిద్దాం... అసెంబ్లీలో జెండా ఎగురవేసిన శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం

స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందిద్దాం...  అసెంబ్లీలో జెండా ఎగురవేసిన శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం

సచివాలయం,  ఆగష్టు 15    
స్వాతంత్ర్య సమరయోధుల అందించిన స్వేచ్ఛా ఫలాలను ప్రజలందరికీ అందిద్దామని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ అవరణలో మువ్వెన్నెల జెండాను శనివారం ఆయన ఎగుర వేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జాతీయ జెండాను ఎగురవేయడమంటే స్వేచ్చను అనుభవించడమేనన్నారు. ఆనాటి స్వాతంత్ర్య సమర యోధులు తమ ప్రాణ త్యాగాలతో దేశ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్య అందజేశారని, వాటి ఫలాలు ప్రజలందరికీ అందిద్దామని అన్నారు. ప్రపంచంలోనే భారత దేశం మొదటి స్థానంలో నిలబెట్టడానికి ప్రస్తుత నేతలందరూ అహర్నిశలూ కృషి చేస్తున్నారని కొనియాడారు. జాతీయ, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడానికి ధైర్యంగా ముందుకు సాగుదామన్నారు. ప్రజా తీర్పుతో ఎన్నికైన ప్రభుత్వాలు వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి భయకంపితం చేస్తోందని, మానవాళి ఉనికికే ప్రమాదకరంగా మారిందని అన్నారు. ప్రజలంతా ఐక్యంగా ధైర్య సాహాసాలతో కరోనా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులు తదితరులు పాల్గొన్నారు.  అంతకుముందు అసెంబ్లీ భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారం జాతీయ జెండాను ఎగుర వేశారు.

Related Posts