YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హిందూ మహిళ మృతదేహానికి ముస్లింల అంత్యక్రియలు

హిందూ మహిళ మృతదేహానికి ముస్లింల అంత్యక్రియలు

అనంతపురం ఆగష్టు 15 
కరోనా కొందరిలో మానవత్వాన్ని చంపిస్తే మరికొందరిలో సేవభావాన్ని తట్టి లేపుతోంది.కోవిడ్ పాజిటివ్ తో మరణించిన మహిళకు అంత్యక్రియలు ముస్లింలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో తాడిపత్రికి చెందిన ఓ మహిళా కోవిడ్ పాజిటివ్ తో మరణించింది.అయితే అంత్యక్రియలు నిర్వ హించేందుకు బంధువులు ముందుకు రాలేదు. సహకరించే వారు ఎవ్వరూ లేకుండా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరికొందరు ముస్లింలు కలసి హిందూ సాంప్రదా యంప్రకారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిం చారు.కోవిడ్ మహమ్మారి కి గురైన బాధితులపై వివక్షను ఆపాలని కోవిడ్ మహమ్మరిని వ్యతిరేకించాలే తప్ప కోవిడ్ బాధిత రోగులను కాదని ఈ సందర్భంగా ముస్లింలు అన్నారు. ఎక్కడైనా కోవిడ్ బాధితులు వివక్ష కు గురైతే కోవిడ్ బాధితులకు ఆహారం నిత్యావసర వస్తువులు అవసరమైతే తమను సంప్రదించాలని ఎవరైనా మరణిస్తే వారి మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు.

Related Posts