YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వచ్చె నెల 4న దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభం

వచ్చె నెల 4న దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభం

విజయవాడ ఆగస్టు 28,
ఐదు సంవత్పరాలుగా నగరాన్ని అభివృద్ది చేయకుండా విజయవాడ ప్రజలను మోసం చేసింది చంద్రబాబు నాయుడు అని, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నగర అభివృద్దికి బాటలు పడ్డాయని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలో స్వాతి సెంటర్ వద్ద క్యాంబే రోడ్డు మరియు గాంధీ బొమ్మ సెంటర్లో దాదాపు 4కోట్లు రూపాయలతో అభివృద్ది పనులకు మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు శుంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు జలీల్ ఖాన్, బొండా ఉమా, గద్దె రామ్మెహనరావు, ఎం.పి కేశినేని నాని విజయవాడకు ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేని దద్దమ్మలు అన్నారు. టిడిపి ప్రభుత్వ హయంలో నగర అభివృద్ది పట్టించుకోని ఎం.పి ...ఇప్పడు దుర్గగుడి ఫ్లై ఓవర్ గురించి మాట్లాడటం హస్యస్పదం గా ఉందన్నారు.  కృష్ణా పుష్కరాలకు దుర్గగుడి ఫ్లై ఓవర్ పూర్తి చేస్తామని చెప్పిన ఎం.పి కేశినేని నాని ఇప్పడు ప్రజలకు ఏమి సమాధానం చేబుతారని ప్రశ్నించారు.  వచ్చె నెల 4 న దుర్గగుడి పైవోర్ తో పాటు బెంజిసర్కిల్ పైవోర్, విజయవాడ అవుటర్ రింగ్ రోడ్డును కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభిస్తామన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత సంక్షేమం, అభివృద్దిని రెండు కళ్లుగా నగర అభివృద్దికి నిధులు మంజూరు చేశారన్నారు.  కార్యక్రమంలో వైసీపీ నాయకులు, నగర పాలక సంస్థ సిబ్బంది ఉన్నారు.

Related Posts