YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

అమరావతి ఆగస్టు 28 
వైయస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి  వైయస్.జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేసారు. వీడియో లింక్ ద్వారా జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వేదాద్రి నుంచి మంత్రులు అనిల్కుమార్యాదవ్, పేర్నినాని, కొడాలినాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్మోహన్రావు, కైలే అనిల్కుమార్, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు హజరయ్యారు.  సీఎం మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతిసమీపంలోని, కృష్ణాజిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగునీటికి, సాగునీటికి కటకటలాడే పరిస్థితి ఉంది. ఐదు ఏళ్లపాటు అధికారంలో ఉండికూడా, ఈ ప్రాజెక్టు చేస్తే మంచి జరుగుతుందని తెలిసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే, 14 నెలల్లోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాన చేశాం. ఫిబ్రవరి 2021 నాటికల్లా ఈప్రాజెక్టును పూర్తిచేయాలని దృఢసంకల్పంతో లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.  నాగార్జున సాగర్ ఎడమ కాల్వనుంచి ఈప్రాంతానికి అందాల్సిన నీరు అందడంలేదు.. దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం. ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తాం. డీబీఆర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితోపాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా వైయస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా నీరు అందిస్తాం. దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ. 490 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుద్వారా నీటికటకట తీరి, ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుకుంటూ.. నాకు ఈ అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అయన అన్నారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ  వేదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించడం ద్వారా రైతు బాంధవుడిగా ముఖ్యమంత్రి నిలిచారని అన్నారు.  ఇది ముఖ్యమంత్రిగారు పెళ్లిరోజు కానుకగా.. రైతులకోసం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టుగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు.

Related Posts