YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సోము వీర్రాజుకి చుక్కలు చూపిస్తోన్న టీడీపీ సోషల్ మీడియా!

సోము వీర్రాజుకి చుక్కలు చూపిస్తోన్న టీడీపీ సోషల్ మీడియా!

మరావతి ఆగష్టు 28  
ఏపీ బీజేపీ చుక్కలు అధ్యక్షుడు సోము వీర్రాజుకి టీడీపీ సోషల్ మీడియా చూపిస్తోందట.  కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీడీపీ సోషల్ మీడియా ఆయనను టార్గెట్ చేయలేదు. కానీ ఇప్పుడు సోము వీర్రాజుపై పెద్ద యుద్ధమే చేస్తోందట..కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఆయనపై విరుచుకుపడింది. ఎందుకంటే కన్నా టీడీపీకి అనుకూలంగా రాజకీయం చేస్తున్నాడని ఆరోపించింది. కన్నాను టీడీపీ తొత్తు అని జనాలను బాగా నమ్మించింది. దీంతో బీజేపీ అధిష్టానం కన్నాను పదవి నుంచి తొలగించిందనే ప్రచారం సాగింది.ఇప్పుడు అదే ప్లాన్ ను టీడీపీ మీడియా అమలు చేస్తోంది. ఎక్కడా దొరకకుండా సోము వీర్రాజును టార్గెట్ చేసి ‘వైసీపీ తొత్తు’ అని నిరూపించడానికి అంతర్జాతీయ స్థాయిలో సోము వీర్రాజును అభాసుపాలు చేసే వ్యవహారాన్ని నరుక్కొస్తోందట..దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది.డీపీలో ఉన్న అసమ్మతి నేతలను లాగేసి కుంపటి రాజేస్తే కొన్ని అయినా సీట్లు సాధించాలని సోము వీర్రాజు  తాపత్రాయపడుతున్నారు. వైసీపీ నుంచి అధికారం వదులుకొని ఎవరూ రారు కాబట్టి.. టీడీపీ నుంచి అయితే వస్తారని సోము ఈ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికీ బీజేపీ కేడర్ బలంగా లేదు కాబట్టి టీడీపీ నుంచి లాగేయాలని ప్లాన్ చేస్తున్నారట.. అయితే ఇది టీడీపీ పసిగట్టి సోము వీర్రాజును ‘అంత కేపాసిటీ కలిగిన వ్యక్తి కాదు’ అని నిరూపించడానికి టీడీపీ సోషల్ మీడియా ద్వారా అటాక్ చేస్తోందంట.. అలా బీజేపీకి 2024 ఎన్నికలకి దిక్కులేక టీడీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి తీసుకొని రావాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.  సోము వీర్రాజు ఉంటే అది కుదరదు కాబట్టి.. ఆయనను వివాదాల్లోకి తీసుకొని పోవాలనేది టీడీపీ ప్లాన్ అని ఆ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.  ఇప్పుడు ఇదే విషయం టీడీపీలో చర్చనీయాంశమవుతోంది.

Related Posts