YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భక్తులు లేకుండానే బ్రహ్మోత్సవాలు

భక్తులు లేకుండానే బ్రహ్మోత్సవాలు

తిరుమల, ఆగస్టు 28
తిరుమల అన్నమయ్య భవన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాలపై నిర్ణయం తీసుకున్నారు. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు.అధికమాసం కారణంగా ఈసారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయని వెల్లడించారు. సెప్టెంబరు 19 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పారు. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో స్వామివారి వాహన సేవలు తిరుమల మాడవీధుల్లో నిర్వహించడం వీలుకాదని, అందుకే బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహిస్తామని వివరించారు. ఒకవేళ కరోనా ప్రభావం తగ్గితే తదుపరి బ్రహ్మోత్సవాలను పూర్వరీతిలో వెలుపల నిర్వహిస్తామని తెలిపారు.

Related Posts