YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అంతరరాష్ట్ర వివాదం... సుప్రీం ఆశ్రయించండి

అంతరరాష్ట్ర వివాదం... సుప్రీం ఆశ్రయించండి

హైద్రాబాద్, ఆగస్టు 31 
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి, శ్రీనివాస్ పిటిషన్ల పై హైకోర్టులో విచారణ జరిపింది. అంతర్రాష్ట్ర జల వివాదం కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. రాష్ట్ర పునర్విభజన చట్టం పరిధిలో విచారణ జరపాలని పిటిషనర్ల న్యాయవాది కోర్టును కోరారు.రెండు రాష్ట్రాల జల వివాదం హైకోర్టు పరిధిలోకి ఎలా వస్తుందని సీజే ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్లతో చర్చించి చెబుతామని న్యాయవాది శ్రవణ్ అన్నారు. దీంతో హైకోర్ట ఈ విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.కృష్ణా నదీ జలాల్లో తమ వాటాగా దక్కిన నీటిని వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలని ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంను చేపట్టింది. అయితే పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులను నిలిపేయాలంటూ తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన ఓ వ్యక్తి కూడా గతంలో ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీని వలన పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవని స్పష్టం చేస్తూ.. జాతీయ హరిత న్యాయస్థానం(ఎన్జీటీ) దక్షిణ ప్రాంత బెంచ్‌(చెన్నై)కి నివేదిక ఇచ్చింది.మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాలతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ఇప్పటికే అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఏపీలో శ్రీశైలం జలాశయానికి సమీపంలో తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రెండు సార్లు కృష్ణా నీటి యాజమాన్యం బోర్డుకు ఫిర్యాదు చేసింది. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదని, విభజన చట్టంలో పొందుపరిచిందేనని ఏపీ తన వాదనను బలంగా వినిపిస్తోంది. మరోవైపు దీనిపై న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ భావిస్తోంది.

Related Posts