YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పురాణాల్లోని ఈ అమ్మ పాత్రలు ఎప్పటికీ ఆదర్శమే!

పురాణాల్లోని ఈ అమ్మ పాత్రలు ఎప్పటికీ ఆదర్శమే!

అమ్మను మించిన దైవం లేదు. అవును ప్రతి ఒక్కరికీ అమ్మే ఆది గురువు. పుట్టిన తర్వాత పిల్లలు నేర్చుకునే మొదటి భాష అమ్మ. అమ్మ పొత్తిళ్లలోనే శిశువుకు విద్యాభ్యాసం మొదలవుతుంది.
పురాణాల్లోని ఈ అమ్మ పాత్రలు ఎప్పటికీ ఆదర్శమే!
అమ్మ ఈ పదం వినడానికే ఎంతో కమ్మగా ఉంటుంది. అమ్మ ఓ అనురాగం.... ఆమే ఓ అపురూపం. అమ్మా అని పిలుపించుకోడానికి ఎంతో మంది మహిళలు తహతహలాడిపోతారు. అమ్మ గురించి చెప్పడానికి ఈ ప్రపంచంలో భాష సరిపోదు. పిల్లల రక్షణ కోసం సైనికుడిగా, అవసరాల్లో స్నేహితుడిగా, కష్టాల్లో కంచుకవచంగా ఉంటుంది. అలాగే హిందూ పురాణాల్లోనూ చాలా మంది అమ్మలు తమ పిల్లల కోసం అనేక త్యాగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. హిడంబి, శృత‌కీర్తి, కర్ణుడిని పెంచిన తల్లి రాధ, సీత లాంటి వాళ్లు నేటి అమ్మలకు ఆదర్శంగా నిలిచారు.
ఎవరి సహాయం లేకుండా ఘటోత్కచుని పెంచిన హిండంబి నేటి తల్లులకు ఓ ఆదర్శం. దుర్యోధునుడి కుట్ర నుంచి తప్పించుకుని అడవిలోకి చేరిన పాండవులను హిడింబాసురుడు సంహరించడానికి ప్రయత్నించి భీముడి చేతిలో మరణించాడు. అతడి సోదరి హిడింబి మాత్రం భీముడిని ప్రేమిస్తుంది. రాక్షస స్త్రీ అయిన హిడంబి ప్రేమను భీముడు అంగీకరించిన తర్వాత ఆమె జీవన విధానమే మారిపోయింది. వివాహం తర్వాత కొద్ది రోజులే కలిసున్న భీముడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఘటోత్కచుడికి జన్మనిచ్చిన హిడంబి అతడికి యుద్ధ తంత్రాలు, ఆయుధాల ప్రయోగించే విధానాన్ని ఎవరి సాయం తీసుకోకుండా నేర్పించి పరాక్రమవంతుడైన యోధుడిగా తీర్చిదిద్దింది. మహాభారతంలో ఈమె పాత్ర చిన్నదైనా తన కుమారుడికి మంచి తల్లిగా, గురువుగా, సంరక్షకురాలిగా నిలిచింది.
శిశుపాలుని తల్లి శృత‌కీర్తి గురించి మహాభారతంలోని సభా పర్వంలో తెలియజేశారు. శిశుపాలుడు జన్మించినప్పుడు వికృత‌ రూపం చూసి అందరూ భయపడ్డారు. అతడి మూడు నేత్రాలు, నాలుగు చేతులతో భయంకరంగా ఉండేవాడు. అయితే శృత‌కీర్తి మాత్రం అతడి పట్ల అవిభాజ్యమైన ప్రేమను కురిపించింది. ఒకరోజు శిశుపాలుడిని కృష్ణుడు తన ఒడిలోకి తీసుకున్నప్పుడు అతడి వికృత‌ రూపం అదృశ్యమవుతుంది. కానీ శిశుపాలుడు తన ప్రవర్తనతో కృష్ణుడిని అవమానించినప్పుడు శృత‌కీర్తి తన బిడ్డను క్షమించమని కోరుతుంది. అయితే 100 తప్పులు వరకు ఎలాంటి శిక్ష ఉండదని ఆమెకు అభయమిచ్చాడు. తల్లి అభ్యర్థన వల్ల శిశుపాలుడు బలవంతుడిగా మారాడు.
కర్ణుడి పెంపుడు తల్లి రాధ కూడా నేటి తరానికి ఆదర్శం. సంతానం కోసం ఎదురుచూస్తున్న రాధకు నదిలో కొట్టుకుపోతూ దొరికిన బాలుడే కర్ణుడు. అందుకే కర్ణుడిని రాధేయుడు అంటారు. దుర్యోధనుడితో స్నేహం మొదలైన తర్వాత ద్రోణాచార్యుడు కర్ణుడిగా నామకరనం చేశాడు.
జమదగ్ని భార్య రేణుక పరశురాముడికి తల్లి కూడా. తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ ప్రకారం పరుశురాముడు రేణుకకు శిరచ్ఛేదనం చేశాడు. కొడుకు చేతిలో ఆమె ఆనందంగా ప్రాణాలు వదలింది.
ద్రౌపది, పాండవులకు పుట్టినవాళ్లే ఉప పాండవులు. అయితే వీళ్లంతా కురుక్షేత్ర యుద్ధంలో మరణించారు. ద్రౌపది మాత్రం వీరిని విలువలతో పెంచింది. అంతే కాదు సుభద్రార్జునుల కొడుకు అభిమన్యుడు అంటే ద్రౌపదికి అమితమైన ప్రేమ.
హిందూ పురాణాల్లో కృష్ణుడిని పెంచిన తల్లి యశోధకు ప్రత్యేక స్థానం ఉంది. కొడుకు తప్పుచేసినప్పుడు దండించడం, తర్వాత అపారమైన ప్రేమతో అతడిని ఓదార్చడంలో యశోధ విలక్షణ శైలిని ప్రదర్శించింది.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts