YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

23న తిరుమలకు జగన్

23న తిరుమలకు జగన్

తిరుపతి, సెప్టెంబర్ 12
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23న తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండ్రోజుల పాటూ ముఖ్యమంత్రి జగన్ తిరుమలలో  ఉంటారు. జగన్‌తో పాటూ తిరుమలకు కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా రానున్నారు. ఈ నెల 23న తిరుమల చేరుకోనున్న జగన్.. గరుడ సేవ సందర్భంగా శ్రీవారికి  పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 24న ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొనే అవకాశం ఉంది. తర్వాత కర్ణాటక అతిథి  గృహం శంకుస్థాపనలో సీఎం జగన్, యడియూరప్పలు పాల్గొనున్నారు. ఆ తర్వాత తిరిగి పద్మావతి అతిథి గృహంకు చేరుకోని అల్పాహారం స్వీకరించి జగన్ తాడేపల్లికి తిరుగు  ప్రయాణం కానున్నారు. ప్రతి ఏటా తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు జరుగుతాయి. గరుడ సేవ రోజు ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా  వస్తోంది. ఇదిలా ఉంటే ఈసారి శ్రీవారి బ్రహోత్సవాలను కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నారు.  

Related Posts