YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుపై ఉన్న కోపం.. ప్రజలపై చూపడం సరికాదు

చంద్రబాబుపై ఉన్న కోపం.. ప్రజలపై చూపడం సరికాదు

గుంటూరు అక్టోబరు 25,
టిడ్కో గృహాలను లబ్దిదారులకు అందజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే నవంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ రిలే దీక్షలు నిర్వహిస్తుందన్నారు. నవంబర్ 16 నుంచి లబ్దిదారులను నేరుగా ఇళ్లల్లోకి తీసుకెళ్తామన్నారు. చంద్రబాబుపై ఉన్న కోపం.. ప్రజలపై చూపడం సరికాదన్నారు. అమరావతికి వ్యతిరేకంగా ప్రభుత్వమే ఆందోళనలు చేయిస్తోందని రామకృష్ణ తెలిపారు. అల్లర్లు సృష్టించి ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అమరావతిపై రిఫరెండంగా ఎన్నికలకు వెళ్దామన్నారు. జగన్‌కు ఒక్క సీటు ఎక్కువ వచ్చిన అమరావతిపై నోరెత్తబోమని రామకృష్ణ తెలిపారు.

Related Posts