వికారాబాద్ అక్టోబరు 27,
బిజెపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ మంగళవారం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. దుబ్బాక లో బిజెపి విజయం ఖాయమనే నిజాన్ని జీర్ణించుకోలేక కెసిఆర్, హరీష్ రావు ల ప్రోత్సాహంతో పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తూ బీజేపీ నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారని బిజెపి రాష్ట్రఅధికార ప్రతినిధి కూర వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దుబ్బాకలోజరుగుతున్నాయని సిద్ధిపేటలో కాదని విమర్శించారు. పోలీస్ కమిషనర్ అక్రమంగా పార్టీ నాయకులను అరెస్ట్ చేసి ప్రచారాలు కొనసాగుటకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ప్రజలు బిజెపి వైపు ఉన్నారనే విషయం జీర్ణించుకోలేక ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు డౌన్.. డౌన్... అంటూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న పోలీస్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని నినదిస్తూ సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం చౌరస్తా లోని అంబేద్కర్వ్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమములో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు