YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తోగుటలో తెరాస యువ గర్జన భారీ బైక్ ర్యాలీ.... ర్యాలీలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు

తోగుటలో   తెరాస యువ గర్జన భారీ బైక్ ర్యాలీ.... ర్యాలీలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు

దుబ్బాక అక్టోబ‌రు 27, 
దుబ్బాక నియోజకవర్గం తోగుటలో తెరాస యువ గర్జన కార్యక్రమం జరిగింది. ఈ నేపధ్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రి హరీశ్ రావు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ డిసెంబర్ 9 న ఆనాడు వచ్చిన తెలంగాణ వెనక్కుపోతో అందరు రాజీనామాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం రాజీనామా చేయలేదు. ఇవ్వాళ కిషన్ రెడ్డి నేను తెలంగాణ అంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనం తెచ్చిప్రతీ ఒక్కరి అక్కౌంట్లో 15 లక్షలు వేస్తం అన్నారు. ఆరేళ్లయింది  ఆ 15 లక్షలు వచ్చాయాని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి కోటి  ఉద్యోగాలన్నారు. ఆరేళ్లలో ఆరు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి... ఇచ్చిండ్రా.. నిజామాబాద్ లో అర్వింద్ కుమార్ తాను గెలిస్తే,  పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. వచ్చిందా పసుపు బోర్డు. బీజేపీ  ప్రభుత్వం మార్కెట్ లను రద్దు చేసి రైతులను కష్టాల్లోకి నెట్టిన పార్టీ. బాయిలకాడా మీటర్లు పెట్టే పార్టీ బీజేపీ. ముత్యం రెడ్డి మంచి నాయకుడని కాంగ్రెస్ మొసలి కన్నీరుకారుస్తోంది. అదే నిజమయితే కాంగ్రెస్ 2018లో టికెట్ ఎందుకు ఇవ్వలేదు  ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ కు ఢిల్లీలో ఏం లేదు.... గల్లీలో ఏం లేదని అయన అన్నారు.

Related Posts