YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కోటి దాటిన ర‌జ‌నీ పార్టీ స‌భ్య‌త్వం

కోటి దాటిన ర‌జ‌నీ పార్టీ స‌భ్య‌త్వం

కోటి దాటిన ర‌జ‌నీ పార్టీ స‌భ్య‌త్వం
చెన్నై అక్టోబ‌రు 31,
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. తమిళనాడు రాజకీయాల్లో ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న రజనీకాంత్ పార్టీ వచ్చే సమయం దగ్గరపడింది. ఆయన పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు సంకేతాలను పంపారు. బహుశ డిసెంబరు నెలలో పార్టీ ప్రకటన ఉంటుందని రజనీకాంత్ సన్నిహితులు చెబుతున్నారు.
రజనీకాంత్ 2017లో పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించలేదు. ముందుగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం పార్టీ కంటే ముందుగా రజనీ మక్కల్ మండ్ర ను స్థాపించి తమిళనాడు వ్యాప్తంగా సభ్యత్వాలను చేర్చే పనిని రజనీకాంత్ ప్రారంభించారు. తాను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా సమయం చిక్కినప్పుడల్లా మక్కల మండ్ర పై సమీక్ష చేస్తున్నారు.ఇప్పటికే రజనీ మక్కల్ మండ్ర సభ్యత్వం సంఖ్య కోటి దాటిందని చెబుతున్నారు. ఎన్నికల సమాయానికి మరో కోటి చేయాలన్న లక్ష్యంతో రజనీకాంత్ అభిమానులున్నారు. ప్రతి గ్రామంలోనూ మక్కల మండ్ర సభ్యులు ఉండేలా చర్యలు తీసుకోవాలని రజనీకాంత్ ఇప్పటికే బాధ్యులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో పది మంది సభ్యులకు తక్కువ కాకుండా ఉండేలా చూడాలని ఆయన గట్టిగా చెబుతుండటంతో అదే పనిలో ఉన్నారు.ఇక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రజనీకాంత్ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబరులో పార్టీ ప్రకటన ఉండే అవకాశముంది. దీంతో రజనీకాంత్ మక్కల్ మండ్ర సభ్యులకు టార్గెట్ విధించారు. ఈ రెండు నెలల్లో జిల్లాకు మరో పది లక్షల మంది సభ్యులు ఉండేలా చూడాలని రజనీకాంత్ ఆదేశించారు. రజనీ మక్కల్ మండ్రలోని సభ్యులే రేపు పార్టీ నేతలుగా మారనుండటంతో తమిళనాడులో ఎక్కువ మంది చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Related Posts