YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కూల్చివేతలతో చిత్రావతి ముంపు గ్రామంలో ఉద్రిక్తత

కూల్చివేతలతో చిత్రావతి ముంపు గ్రామంలో ఉద్రిక్తత

కూల్చివేతలతో చిత్రావతి ముంపు గ్రామంలో ఉద్రిక్తత
అనంతపురం అక్టోబరు 31
ఆదో ముంపు గ్రామం. ప్రభుత్వం పరిహారం ఇస్తే ఖాళీ చేద్దామని గ్రామస్థులు నిరీక్షిస్తున్నారు.  కానీ అధికారులు న్యాయం చేస్తామని నోటిమాట చెప్పి జేసీబీలను రంగంలోకి దించారు.  

బలవంతంగా ఇళ్ల కూల్చివేత ప్రక్రియ చేపట్టారు.  ఈ క్రమంలో ఓ బాలుడు గాయపడ్డాడు. కూల్చివేతలో ప్రభుత్వ తీరును తెలుగుదేశం తప్పుబట్టింది.  అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం

మర్రిమాకులపల్లిలో ఇళ్ల తొలగింపు ప్రక్రియలో అధికారుల అత్సుత్సాహం..ఒక బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది.   చిత్రావతి జలాశయం ముంపు గ్రామమైనందున ఖాళీ చేయాలంటూ

అధికారులు జేసీబీ యంత్రాలతో రంగంలోకి దిగారు.   పరిహారం కోసం ప్రశ్నించిన గ్రామస్థులతో ఆర్డీవో ఓ వైపు చర్చిస్తున్నారు.   అర్హులందరికీ పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.  

అంతలోనే ఇళ్ల కూల్చివేత మొదలైంది.   ఓ ఇంటి గోడను ముందుకు కూల్చాల్సిన డ్రైవర్ వెనక్కి కూల్చడంతో గోడ శిథిలాలు నాగచైతన్య అనే బాలుడిపై పడ్డాయి. తలకు గాయాలయ్యాయి.  

పార్వతమ్మ అనే మహిళకు చేయి విరిగింది.   అసలే ఆవేదనలో ఉన్న గ్రామస్థులు ఆగ్రహించారు.   జేసీబీ అద్దాలు పగలగొట్టారు. వాహనాలపై రాళ్లు రువ్వేయత్నం చేశారు.   ధర్మవరం

ఆర్డీవో మధుసూదన్ బాలుడ్ని హుటాహుటిన బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనపై తెలుగుదేశం మండిపడింది.   బతికుండగానే మనుషుల్ని సమాధి చేసే క్రూరమైన

ఆలోచనలు వైకాపా సర్కార్కు ఎలా వస్తున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిలదీశారు.   ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని, మనుషులు ఉండగానే ఇళ్లను

కూల్చడాన్ని ఏమనాలని ట్విట్టర్లో ప్రశ్నించారు.   బాధితులను మాజీ మంత్రి పరిటాల సునీత ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.  15 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.   రైతులకు

పరిహారం ఇవ్వకుండానే ఖాళీ చేయించడం సరికాదన్నారు.  మర్రిమాకులపల్లిలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.   ఊర్లోకి చిత్రావతి జలాశయం నీరు వస్తుండటంతో భయం భయంగా

గడుపుతున్నారు.

Related Posts