YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎర్రన్నాయుడు లేని లోటు టీడీపీకి తీరనిది పార్లమెంటులో తెలుగువారి గొంతును వినిపించిన వ్యక్తి ఎర్రన్నాయుడు

ఎర్రన్నాయుడు లేని లోటు టీడీపీకి తీరనిది పార్లమెంటులో తెలుగువారి గొంతును వినిపించిన వ్యక్తి ఎర్రన్నాయుడు

ఎర్రన్నాయుడు లేని లోటు టీడీపీకి తీరనిది
పార్లమెంటులో తెలుగువారి గొంతును వినిపించిన వ్యక్తి ఎర్రన్నాయుడు
విజయవాడ నవంబర్ 2,
టీడీపీకి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ప్రముఖ వ్యక్తుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడని ఎమ్మెల్సీ అశోక్ బాబు కొనియాడారు. ఎర్రన్నాయుడు లేని లోటు టీడీపీకి తీరనిదని అన్నారు. ఎర్రన్నాయుడు ఎనిమిదవ వర్థంతి కార్యక్రమాన్ని ఆత్మకూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి బీసీల వానిని ఎర్రన్నాయుడు వినిపించారని గుర్తు చేశారు. ఎర్రన్నాయుడు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఆయన ఆశీస్సులుంటాయని తెలిపారు. యువకుడిగా రాజకీయాల్లో వచ్చి ఎన్టీఆర్, చంద్రబాబుతో కలిసి నడిచి రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారని వికలాంగ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. తెలుగురాష్ట్రాల్లో ఎర్రన్నాయుడు తెలియని వ్యక్తి ఎవరూ లేరన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే పార్లమెంటులో నిలదీసిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని గుర్తు చేశారు. తనయుడు రామ్మోహన్ రావు, తమ్ముడు అచ్చెన్నాయుడు ప్రజల తరపును నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎర్రన్నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, టీడీపీ నాయకులు వల్లూరి కుమారస్వామి, పలువురు కార్యకర్తలు పాల్గొని నివాళర్పించారు.

Related Posts