యాదాద్రి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా సంతోషి
భువనగిరి నవంబర్ 2,
యాదాద్రి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా సంతోషి నియమితులయ్యారు. భారత, చైనా సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చేందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందడంతో అతని భార్య సంతోషిణి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ గా నియమించింది. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న సంతోషి ని రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి జిల్లాకు కేటాయించింది. ఈ నేపథ్యంలోనే దివంగత కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి యాదాద్రి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు.. ఈ మేరకు సంతోషి యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ కు రిపోర్టు చేశారు