YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గిరిజన భూముల్లో.. కార్పొరేట్ సంస్థలు

 గిరిజన భూముల్లో.. కార్పొరేట్ సంస్థలు

భద్రాచలం ఏజెన్సీలోని వ్యవసాయం కార్పొరేట్‍ఉచ్చుకు చిక్కింది. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ప్రముఖ కంపెనీలు విచ్చలవిడిగా మన్యం లో విస్తరిస్తున్నాయి. గిరిజన చట్టా లను తుంగలో తొక్కి కార్పొరేట్ సంస్థలు వేగంగా విస్తరిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒకవైపు రైతులను మోసగిస్తున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నా ఖద్దరు కనుసన్నల్లో దర్జాగా కార్పొరేట్‍ కాలర్‍ ఎగరేస్తోంది. ఒకప్పుడు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసిన గిరిజన ప్రాంత రైతులు నేడు ఇష్టా రాజ్యంగా పురుగుమందులు పిచికారీ చేస్తూ పెట్టుబడులు పెంచుకుంటూ అప్పుల ఊబిలో దిగబడుతున్నారు. ఈ కార్పొరేట్‍ వ్యవసాయంలో బడా రైతులతో పోటీ పడలేక సన్నచిన్నకారు రైతులు డీలా పడిపోతున్నారు.
మిర్చితో పాటు దాదాపు రెం డు వేల ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు కూడా కార్పొరేట్ సంస్థలు చేపట్టాయి. ఈ రెం డు జిల్లాల్లో సుమారు నాలుగు బహుళజాతి సంస్థలు పోటీపడి రైతులను ఈ ఉచ్చులోకి దించుతున్నాయి. అయితే వీరు అంటగట్టిన విత్తనాలతో దిగుబడి సరిగ్గా రావడం లేదు. గతంలో వాజేడు మండలంలోని ఏడుచర్లపల్లిలో రైతులు పంటను తగలబెట్టారు. వెంకటాపురం మండలం పాత్రాపురం గోదావరి పాయలో పంట దిగుబడి రాక రైతులు నష్టపోయారు. కానీ వారికి పరిహారం మాత్రం ఇవ్వలేదు. సంప్రదాయ వ్యవసాయానికి గండికొట్టి కార్పొరేట్ వ్యవసాయం ఉచ్చులోకి దించుతున్న ఈ సంస్థ లు మన్యంలో సాగును ఛిద్రం చేస్తున్నాయి. సేంద్రీయ ఎరువులను రైతులు మరిచిపోతున్నారు.
కంపెనీలు ఇచ్చిన మందులు, ఎరువులతో భూముల్లో సారం తగ్గిపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేట్ ఉచ్చు నుంచి ఏజెన్సీ వ్యవసాయాన్నికాపాడాలని పలువురు కోరుతున్నారు.
భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల పరిధిలో గోదావరి పరివాహక ప్రాంతంలోని నల్లరేగడి నేలల్లో పండించే మిర్చికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్‍ ఉంది. సహజంగా నల్లరేగడి నేలలో సాగయ్యే మిర్చికి భిన్నంగా కార్పొరేట్ సంస్థలు సూచిం చిన పురుగుమందులు, ఎరువులతో పండిస్తున్నారు. రైతులతో ఒప్పం దం చేసుకుని వ్యవసాయం చేయిస్తున్నారు. దీన్ని బాండ్‍ వ్యవసాయం అంటారు. బయట మార్కెట్‍కం టే కొంచెం ఎక్కువ ధరకు మిర్చిని కొనుగోలు చేస్తామని ఒప్పందంలో పేర్కొంటున్నారు.  లాభసాటిగా ఉండటంతో క్రమేపీ కార్పొరేట్‍ఉచ్చుకు చిక్కుతున్నారు. రెండు జిల్లాల సరిహద్దుల్లో ని గోదావరి పరివాహక ప్రాంతంలో సుమారు 3వేల ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. ప్రధానంగా రాజకీయ పార్టీల నేతల కనుసన్నల్లో కార్పొరేట్‍వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.
పెసా చట్టా నికి విరుద్ధం గా బాండ్ వ్యవసాయం సాగుతోంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గోదావరి పరివాహకం మొత్తం 5వ షెడ్యూల్ లో ఉంది. ఆదివాసీల రక్షణ కోసం ప్రత్యేక గిరిజన చట్టాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అమల్లో ఉన్న భూబదలాయింపు నిషేధిత చట్టం 1959,1/70పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు షెడ్యూల్ ప్రాంతాల్లో పెసా చట్టాన్ని అనుసరించి పాలన సాగించాలి. కాంట్రాక్టు, ఒప్పంద వ్యవసాయం కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 133 అమలు చేయాల్సి ఉంది. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం తదితరమండలాల్లో దాదాపు 3వేల ఎకరాల్లో బై బ్యాక్ విధానంతో మిర్చి కొనుగోలు చేస్తూ పై చట్టాలు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్‍, బహుళజాతి కంపెనీలు విత్తన, కాం ట్రాక్టు సేద్యం చేస్తున్నాయి.బై బ్యాక్ పద్ధతిలో కాంట్రాక్టు వ్యవసాయం చేస్తున్నందువల్ల జీవో నెం. 133 ప్రకారం వ్యవసాయశాఖ, మార్కెట్‍శా ఖల వద్ద ముందుగానే నమోదు చేసుకోవాలి. ఏ సర్వే నంబరులో ఏ రైతు ఎంత సేద్యం చేస్తున్నారు, గ్రామాలవారీగా వివరాలు అందించాలి. పంటలకు సంబంధించిన సాం కేతిక సహకారం పూర్తిగా అందించాలి. రైతులు పండించిన పంటను ఏ ధరకు కొనుగోలు చేస్తారో ముందుగానే రాతపూర్వకంగా తెలియజేయాలి. కానీ బహుళజాతి సంస్థలు నిబంధనలను అతిక్రమించి మిర్చిని మార్కెట్‍కు తరలించే సమయంలో మాత్రమే రైతులకు స్లిప్పులను అందిస్తున్నాయి. ఏజెన్సీ పెసా చట్టం ప్రకారం గ్రామసభలు ఏర్పాటు చేసి సాగు చేసే అవకాశం కల్పించాల్సి ఉండగా దీనిని ఎవరూ పట్టించు కోవడంలేదు

Related Posts