YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వింతలు

కూతురి కాపురానికి భారీ కానుకలు

కూతురి కాపురానికి భారీ కానుకలు

తమిళనాడుకు చెందిన ఓ రాజకీయనేత తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాడు. పెళ్లి సందర్భంగా కూతురు కాపురానికి కావాల్సిన వస్తువులన్నీ ఇవ్వడం హిందూ సంప్రదాయంలో ఆచారంగా వస్తున్నది. ఇదే ఆచారాన్ని కొనసాగించాడు ఈ మాజీ ఎమ్మెల్యే. ఇక కూతురు తాను ఇచ్చిన వస్తువులు లిస్ట్ చెబితే ఓ పుస్తకం అవుతుంది. లారీల కొద్ది సామగ్రిని పంపించాడు.ఫంక్షన్ హాల్ లో ఆ వస్తువులను పెడితే హాల్ అంతా నిండి పోయింది. ఆ సామాన్లను మోసుకెళ్లడానికే ఓ రెండు వందల మందికి పైగా కావాల్సి వచ్చిందంటే ఎన్ని సామాన్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కూతురు పెళ్లి సందర్భంగా  తమ ఆచారం ప్రకారం.. కూతురుకు పెళ్లి కానుకగా రెండు కిలోల బంగారు ఆభరణాలు కిలోలకొద్ది వెండి సామగ్రి రెండు బైక్లు ఓ ఖరీదైన కారు వ్యవసాయం చేసుకోవడానికి సరిపోయిన ఎద్దులు ట్రాక్టర్ మేకలు గొర్రెలు పశుసంపద ఓ యాబై బియ్యం బస్తాలు  ఇదీ అదీ అని లేకుండా ఇంటికి సంబంధించిన వంట సామగ్రి వస్తువులు అన్ని ఇచ్చాడు. ఈ కానుకలు చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.తమిళనాడులో తమిళ అరసన్ అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముఖ్య నేత. ఒకప్పుడు ఎమ్మెల్యేగా పదవిలోనూ ఉన్నారు. మదురై జిల్లా మేళూరుకు చెందిన ఈయనకు కూతురు ఆర్తి పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలనే తలంపు పుట్టింది. అదే ప్రాంతానికి చెందిన వెట్రివేల్కు ఇచ్చి ఈ నెల నాలుగో తేదీన వైభవంగా వివాహం జరిపించాడు.పెళ్లి జరిగిన భవనంలోని ఒక పెద్ద గది మొత్తం ప్లాస్టిక్, వెండి, బంగారు పాత్రలు, టీవీలు, మిక్సర్లు, గ్రైండర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు సహా కొత్త వాహనాలు ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి కానుకగా ట్రాక్టర్లు ఇవ్వడం గమనార్హం.ఫొటోలను పరిశీలిస్తే.. అందులోని వస్తువులు, వాహనాలు పెళ్లికుమార్తెకు వివాహ లాంఛనాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీటి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పెళ్లికి వచ్చిన వారితో పాటు, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను చూసిన వారు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Related Posts