శ్రీశైలం నవంబర్ 16,
శ్రీశైలంలో సోమవారం కార్తీకమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కార్తీకమాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. శ్రీస్వామిఅమ్మవార్ల లఘుదర్శనానికి ( దూరదర్శనానికి) మాత్రమే అవకాశం వుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలుచేస్తున్నారు. ఆర్జిత అభిషేకాలలో మొదటి విడతను ఉదయం. గం. 6.30 లకు: రెండవ విడతను ఉదయం గం. 8.30లకు: మూడవ విడతను ఉదయం గం.11.30లకు: నాలగవవిడతను సాయంత్రం గం.6. 30లకు జరిపించడం జరుగుతుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్జిత హోమాలు నిర్వహిస్తున్నారు. రుద్రహోమం – మృత్యుంజయహోమాలలో మొదటి విడత ఉదయం గం. 8.00లకు మరియు రెండవ విడత గం. 9.30లకు జరిపిస్తున్నారు. చండీహోమం మొదటి విడత ఉదయం గం. 7.30లకు రెండవ విడత ఉదయం గం.10.00లకు జరుగుతుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే పుష్కరిణి హారతికి భక్తులకు అనుమతి ఇచ్చారు.