YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇవాళ, రేపు జనసేనాని అమరావతి టూర్

ఇవాళ, రేపు జనసేనాని అమరావతి టూర్

విజయవాడ, నవంబర్ 16, 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటన ఖాయమైంది. కరోనా, ఆ తర్వాత సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న వకీల్ సాబ్ చాలా రోజుల తర్వాత ఏపీలో అడుగు పెట్టబోతున్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సమావేశాలు రెండు రోజులపాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్నాయి. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ ఈ సమావేశాలలో పాల్గొనున్నారు. ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్‌, అనంతపురం నియోజకవర్గాలలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 17న ఉదయం 11 గంటలకు ఈ ఐదు నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న మధ్యాహ్నం మూడు గంటలకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం జరుగుతుంది.ఈ నెల 18న ఉదయం పది గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన కొందరు మహిళా రైతులతో సమావేశం అవుతారు. క్రియాశీలక సభ్యత్వం మరో 32 నియోజకవర్గాలలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి 32 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో 11 గంటలకు సమావేశమవుతారు. సభ్యత్వ నమోదు కోసం పార్టీ ఐ.టీ విభాగం రూపొందించిన యాప్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను పరిశీలిస్తారు. ఆ మేరకు ఆయన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు

Related Posts