YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పద్మావతి అమ్మవారి ఆలయంలో రాష్ట్రపతి

పద్మావతి అమ్మవారి ఆలయంలో రాష్ట్రపతి

తిరుపతి నవంబర్ 24 
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని  రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుడా దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో బసంత్కుమార్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చక బృందంతో కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను వారికి ఛైర్మన్ అందించారు.  ఈ కార్యక్రమంలో   కలెక్టర్  భరత్ నారాయణ గుప్తా, ఇంటెలిజెన్స్ ఐజి  శశిధర్ రెడ్డి, టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ  రమేష్రెడ్డి, అదనపు సివిఎస్వో  శివకుమార్ రెడ్డి, విజివో మనోహర్, డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.

Related Posts