YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్ వద్ద హైటెన్షన్..

నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్ వద్ద హైటెన్షన్..

రామతీర్థం ఘటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ ఘటనపై విమర్శల దాడి జరుగుతుంది. కాడా బీజేపీ-జనసేన సంయుక్తంగా చేపట్టిన ధర్మయాత్రను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మరోసారి 'చలో రామతీర్థం' కు పిలుపునిచ్చింది బీజేపీ. ఎట్టి పరిస్థితిల్లోనూ రామతీర్థం ఆలయాన్ని నేడు సందర్శించే తీరుతామని తేల్చిచెప్పారు బీజేపీ నేతలు. ఈ క్రమంలో రామతీర్థం పరిసర ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ర్యాలీలు, ఆందోళనలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. దీంతో రామతీర్థం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో మరోసారి హై టెన్షన్ నెలకుంది. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.

Related Posts