YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే ను డ్రోన్ కెమెరా ద్వారా ప్రారంభం - సబ్ కలెక్టర్ కల్పనా కుమారి

రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే ను డ్రోన్ కెమెరా ద్వారా ప్రారంభం -  సబ్ కలెక్టర్ కల్పనా కుమారి

అయోద్య రామ జన్మ భూమిలో నూతన రామాలయ నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమ రధ యాత్రను విశ్వ హిందూపరిషత్ నాయకులు జిలకర్ర.రమణ గారి ఆధ్వర్యంలో  ఉదయం పెదగంట్యాడ , బాలచెరువు శివాలయం వద్ద ఏర్పాటు చేశారు. ముఖ్య అతిదిగా వచ్చిన బీజేపి గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్ది.నరసింగరావు, ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ శ్రీనివాస్ గార్లు జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్బంగా నరసింగరావు మాట్లాడుతూ 450 సం.రాల భారతీయుల కల నెరవేరుస్తూ దేశ ప్రదాని శ్రీ నరేంద్ర మోదీ  గత సం. ఆగస్టు 5 న అయోద్య రామజన్మభూమిలో నూతన ఆలయానికి భూమి శంకుస్థాపన చేసారని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచేవిదంగా భవ్యమైన రామాలయం నిర్మాణానికి దేశ వ్యాప్తంగా నిది సమర్పణ ఉద్యమ కార్యక్రమం ఈనెల 14వ తేదీ నుండి 30వ తేదీ వరకు రామ భక్తులు ఇంటింటికీ వెల్లి ఆలయ విశిష్టతలను వివరించి, భక్తుల శక్తిమేరకు సమర్పించే నిదిని నేరుగా అయోద్య రామ మందిర అకౌంటులో జమ చేసి, భక్తులకు రసీదు ఇస్తారని, ఈ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని భారతీయుల ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా ఎక్సిక్యూటివ్ మెంబర్ శశిదరన్ పిల్లై , రాష్టృ స్తాయి నాయకులు బాటాశ్రీను ,66వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ది డా.గొర్లె.సత్యనారాయణ, 72వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ది సిరసపల్లి నూకరాజు ,మహిళా మోర్చా జిల్లా నాయకురాలు భువనేశ్వరి, 87వ వార్డు మహిళా మోర్చా అధ్యక్షురాలు బొండాశ్రీదేవి ,వార్డు అధ్యక్షులు కిలానిముసలయ్య ,66వ వార్డు ఉపాధ్యక్షులు సూరిబాబు , 87వ వార్డు బీజేపి నాయకులు బొండా.యల్లాజీ  , ఆర్ ఎస్ ఎస్ కృష్ణ  , కే.అప్పారావు , బారీగా ఆర్ ఎస్ ఎస్ నాయకులు, బీజేపి నాయకులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts