YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరజ్యోతీ ర్యాలీని ప్రారంభించిన బాలకృష్ణ

అమరజ్యోతీ ర్యాలీని ప్రారంభించిన బాలకృష్ణ

బేగంపేట్ రసూల్ పుర చౌరస్థలోని ఎన్ టీ ఆర్ విగ్రహానికి పూలదండ వేసి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ నేతలు  నివాళులు అర్పించారు. తరువాత బాలకృష్ణ  అమరజ్యోతి ర్యాలీని ప్రారంభించారు. బాలకృష్ణ మాట్లాడుతూ ఒక మనిషి శక్తిగా మారి వ్యవస్థను సమూలంగా మార్చిన మహా నేత ఎన్టీఆర్. సత్సకల్పం ఉంటే సాధించలేనిది ఏమి లేదని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్. అనితర సాధ్యం కానీ ఎన్నో పాత్రలు ధరించి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి స్వయం పాలనకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత. ఎన్టీఆర్ రాష్ట్రానికే కాకుండా దేశానికి చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తి దాయకమని అన్నారు.

Related Posts